
ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : కింజరాపు అచ్చెన్నాయుడు
- Ap political StoryNewsPolitics
- June 4, 2023
- No Comment
- 26
ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒకేసారి 278 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం మనసు జీర్ణించుకోలేకపోతోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి మనోస్థైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థించారు. గాయపడిన వారికి ఒడిశా ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరించాలన్నారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలను కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలన్నారు.