రాజమండ్రి నగరంలో  అవినీతి జరుగుతోంది

రాజమండ్రి నగరంలో అవినీతి జరుగుతోంది

అభివృద్ధి సుందరీకరణ ముసుగులో రాజమండ్రి నగరంలో అవినీతి జరుగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆరోపించారు. శనివారం రాజమండ్రిలోని 48వ డివిజన్‌లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిధిగా హాజరై ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని అన్నారు.

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. టిడిపి హాయాంలో మొదలుపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌ పాలనలో ఎక్కడిక్కకడే నిలిచిపోయాయన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ దోచుకుంటే సుందరీకరణ పేరుతో లోకల్‌ లీడర్లు దండుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *