జగన్, భారతిలకు కోర్టు నోటీసులు?

జగన్, భారతిలకు కోర్టు నోటీసులు?

జగన్ కు షాకింగ్ న్యూస్. ప్రజాధనాన్ని సాక్షి పత్రికకు దోచిపెడుతున్న కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి సాక్షి ఎండీ భారతికి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వెళ్లాయి. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఒక దినపత్రికని కొనాలంటూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందుకోసం వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు మంజూరు చేసింది. దొడ్డిదారిన ఈ జీవో ఇచ్చి పరోక్షంగా సాక్షి పేపరు సర్కులేషన్ ను పెంచడంపై ఉషోదయా పబ్లికేషన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే, సుప్రీం విచారణను ఏపీ హైకోర్టు కకుండా ఢిల్లీ హైకోర్టుకు బదలాయించింది. ఈ కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టు సిబ్బంది… నేరుగా నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. జగన్ దంపతులకు నోటీసులు అందజేసినట్టు తెలుస్తోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *