మరో ఎదురు దెబ్బ

మరో ఎదురు దెబ్బ

జగన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి చీవాట్లు పెట్టింది. అమరావతి రాజధానిలోని హైకోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా లైట్లు వేయాలంటూ గతంలో CRDA అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో అంతా చీకటిగా ఉంటోందని, కోర్టుకు వస్తున్న వేలాది మంది చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లైట్లు వేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నా CRDA అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు దిక్కార పిటిషన్ దాఖలైంది. CRDA కమిషనర్ వివేక్ యాదవ్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఉన్నతాధికారులకు హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా దున్నపోతుపై వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *