
సిసోడియాకు తాత్కాలిక బెయిల్
- NewsPolitics
- June 4, 2023
- No Comment
- 22
ఢల్లీి లిక్కర్ స్కాంలో నిందితుడు, ఢల్లీి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలుసుకునేందుకు మధ్యంతర ఉపశమనం పొందిన అనంతరం శనివారం తీహార్ జైలు నుంచి తన నివాసానికి చేరుకున్నారు. నగర పాలక సంస్థ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసుల్లో అరెస్టయిన ఆప్ నేతను ఆయన భార్యను కలిసేందుకు ఢల్లీి హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
సిసోడియాను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తన భార్యను కలిసేందుకు అనుమతించిన తన నివాసానికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ను జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ఆదేశించారు. సిసోడియాను భద్రతా ఏర్పాట్లతో ఉదయం 9 గంటలకు ఆయన నివాసానికి తీసుకెళ్లినట్లు జైలు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ కుంభకోణంలో సిసోడియా పాత్రపై ఆరోపిస్తూ ఫిబ్రవరి 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసి అప్పటి నుంచి కస్టడీలో ఉన్నారు.
సీబీఐ కేసులో ఆయనకు మే 30న హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులో మార్చి 9న అరెస్టు చేసిన ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియా తన కుటుంబంతో తప్ప మీడియాతో లేదా మరే ఇతర వ్యక్తులతో సంభాషించరాదని, ఫోన్ లేదా ఇంటర్నెట్ను కూడా యాక్సెస్ చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది.