మామిడి బోర్డు ఏర్పాటు పై పరిశీలన : నారా లోకేష్ హామీ

మామిడి బోర్డు ఏర్పాటు పై పరిశీలన : నారా లోకేష్ హామీ

యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం డోన్ నియోజకవర్గం, పోతుదొడ్డి, మానుదొడ్డి గ్రామాల మామిడి రైతులు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. పోతుదొడ్డి, మానుడొడ్డి గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లోనూ మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. గిట్టుబాటు ధరలు లేని సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. మామిడికి ధరల్లేనప్పుడు నిల్వ ఉంచుకోవడానికి స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మామిడి రైతుల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. పంట నష్టపోయిన వారిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలో గిట్టుబాటు ధరకు అదనంగా రూ.2లు ఇచ్చి ఆదుకున్నాం. వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి మామిడి రైతుల్ని దగా చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరల్లేకపోయినా వైసీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. రాష్ట్రంలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తానని హామీనిచ్చిన జగన్ మర్చిపోయారు. మేము అధికారంలోకి వచ్చాక మామిడి బోర్డు, స్టోరోజ్ గోడౌన్ ఏర్పాటుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *