నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తాం నారా లోకేష్ హామీ

నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం
పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురం గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు.

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి కుటుంబాలను విడదీస్తున్నాడు.

ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇంటికి ఒక కుళాయి మాత్రమే ఇస్తున్నారు. ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులను అడ్డగోలుగా బనాయిస్తున్నారు.

కె.సుధాకర్ అనే వ్యక్తిని వైసీపీ నేతలు కొట్టి, తిరిగి బాధితుడిపైనే కేసులు పెట్టారు.

మా గ్రామంలో ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదు.

రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి.

కల్తీ విత్తనాలు, పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇసుక ధరలు పెంచడంతో ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం.

విద్యార్థులకు ఫీజులు విపరీతంగా పెరిగాయి. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు.

మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైంది.

రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయి.

రాష్ట్రంలో సైకోపాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారు.

మేం అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ అక్రమంగా ప్రజలను, టిడిపి కార్యకర్తలను వేధించిన పోలీసు అధికారులకు ఉద్వాసన పలుకుతాం.

వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కనుమరుగైంది. పంచాయతీల నిధులు రూ.8,600కోట్లను ప్రభుత్వం దారిమళ్లించింది.

టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి ఇస్తాం.

అడ్డగోలుగా పెంచిన పాఠశాల, కళాశాల ఫీజులను క్రమబద్దీకరించి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్ధరిస్తాం.

కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై ఉక్కుపాదం మోపుతాం అని లోకేష్ వెల్లడించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *