ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం పెండింగ్ బిల్లులు అందిస్తాం : నారా లోకేష్

ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం పెండింగ్ బిల్లులు అందిస్తాం : నారా లోకేష్

డోన్ నియోజకవర్గం ఎస్.రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. టిడిపి హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామంలో నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి సిసి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు.

అప్పలుచేసి ఇళ్లు పూర్తిచేసుకున్న మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులు ఇప్పించి, సిసి రోడ్లు నిర్మించండి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పేదలపై కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో అసంపూర్తిగా నిలచిపోయిన సుమారు 2లక్షల ఇళ్లకు గత టిడిపి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఇళ్లనిర్మాణం పూర్తిచేసింది.

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు అందజేస్తాం. రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సిసి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *