కొడాలి నాని పై మండిపడ్డ రావి

కొడాలి నాని పై మండిపడ్డ రావి

20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయలేని కొడాలి నాని ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ పర్యటించటం సిగ్గుచేటు అంటూ రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. నేడు శుక్రవారం ఇదేమి ఖర్మ రాష్ట్రానికి నినాదంతో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం లో రావి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నాని నాలుగేళ్లలో గుడివాడ పట్టణానికి ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్థానిక మూడో వార్డులో వేసిన సిమెంట్‌ రోడ్డు, కల్వర్టు, ప్రతి ఇంటికి కోళాయి ద్వారా తాగు నీరు అందించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నారు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగాను, 4 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏమి అభివృద్ధి చేశారు అని సూటిగా ప్రశ్నించారు. పేద ప్రజలకు పెన్షన్‌ ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు దక్కుతుందన్నారు. ఈనాడు పెన్షన్‌ ఇచ్చామని గొప్పులు చెప్పుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీశారు.

90శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు రంగులు వేసుకోని జగనన్న కాలనీ అని చెప్పకోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది ఎవ్వరినీ వదలమన్నారు. పేదలకు కచ్చితంగా ఆ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *