జగన్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

జగన్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

సాక్షి పేపర్ సర్కులేషన్ పెంచుకునేందుకు సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సాక్షి పత్రిక కొనుగోలు చేసుకునేందుకు ప్రతి నెలా వారికి 200 మంజూరు చేయడంపై ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. కేవలం సాక్షి పేపర్ అమ్మకాలు పెంచుకునేందుకే జీవో విడుదల చేయడంపై ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సీఎం జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా 13 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ పదికి వాయిదా వేసింది.

సీఎం సొంత పత్రిక సాక్షి సర్కులేషన్ పెంచుకునేందుకే ఇలాంటి జీవో ఇచ్చారని ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే వారికే కాని, విమర్శించే వారికి కాదంటూ జీవోలో స్పష్టంగా ఉందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు సీఎం జగన్ రెడ్డి సహా, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

Related post

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *