శ్రీలంకకు మరో బిలియన్‌ డాలర్ల భారత్‌ సాయం

శ్రీలంకకు మరో బిలియన్‌ డాలర్ల భారత్‌ సాయం

  • News
  • May 31, 2023
  • No Comment
  • 21

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక దివాలా దిశలో పయనించిన శ్రీలంకకు తొలి నుంచి భారత్‌ చేయూత నిస్తూనే ఉంది. మానవతా దృక్పథంతో ఐఎంఎఫ్‌ వద్ద గ్యారంటీ సంతకం కూడా చేసింది. ఇదే నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించేలా మరో యేడాది పాటు ఇదే తరహా సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఇందుకు సాక్ష్యంగా మంగళవారం శ్రీలంక ఆర్థిక శాఖ సహాయ మంత్రి శేషన్‌ సేమసింఘే సమక్షంలో భారత్‌ చేసుకున్న ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం వల్ల మరో యేడాది పాటు ఔషధం, ఆహారం, ఇతర నిత్యావసరాల సేకరణ కోసం బిలియన్‌ డాలర్ల భారతీయ క్రెడిట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది.

ఆర్థిక సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్న ద్వీప దేశానికి చాలా అవసరమైన ఆహారం, మందులు, ఇతర అవసరమైన వస్తువులను సేకరించడంలో సహాయం చేయడానికి భారతదేశం మంగళవారం శ్రీలంకకు తన బిలియన్‌ క్రెడిట్‌ లైన్‌ను మరో సంవత్సరం పొడిగించింది. గత ఏడాది మార్చిలో బిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ సౌకర్యం కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో భారతదేశం శ్రీలంకకు క్రెడిట్‌ లైన్‌ను విస్తరించింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *