తుమ్మలవంక బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాం : నారా లోకేష్

తుమ్మలవంక బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాం : నారా లోకేష్

టిడిపి అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి, వలగొండ నుండి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం వలగొండ గ్రామస్తులు లోకేష్ ను తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తుమ్మల వంకపై వంతెన ఉంది. దీనిపై మేం నిత్యం కర్నూలు, బళ్లారి హైవేపై ఆస్పరి గ్రామాలకు ప్రయాణిస్తుంటాం. పై తరగతులు చదివేందుకు విద్యార్థులు దీనిపైనే ప్రయాణించాల్సి ఉంది. వర్షాలు పడినప్పుడు 3-4 రోజులు ఈ వంక పొంగుతుంది.

ఆ సమయంలో మేం ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించండి. వలగొండ నుండి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. వారి సమస్యల పై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే మౌలిక సదుపాయాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు, వంతెన నిర్మాణాలు, సాగు, తాగు ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *