
ఆ 40 నిమిషాలు జైల్లో ఏం జరిగింది?
- Ap political StoryNewsPolitics
- September 15, 2023
- No Comment
- 15
రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలేం జరిగింది..? పవన్ కళ్యాణ్ ఎందుకంత హడావుడిగా పొత్తుపై ప్రకటన చేశారు? ఇవే అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ములాఖత్ లో టీడీపీ అధినేత చంద్రబాబును చూడగానే చలించిపోయిన పవన్..పొత్తుపై అప్పటికప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి 45ఏళ్ల పాటు సేవ చేసిన నాయకుడిని…జైల్లో ఇలా చూడాల్సి రావడం బాధాకరమని పవన్ ఆవేదనకు లోనయ్యారట. అంతే, ఇక ఈ దుర్మార్గపు పాలనపై యుద్ధం ప్రకటించాల్సిందేనని డిసైడ్ అయిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించి, బాబు వద్ద పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారట పవన్.
ములాఖత్లో భాగంగా… జగన్ సర్కార్ అణచివేత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు, పవన్ ఇద్దరూ చర్చించుకున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా… పొత్తుపై బహిరంగ ప్రకటన చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు జనసేనానికి సీబీఎన్ వద్ద ప్రస్తావించారట. ఆశ్చర్యపోయిన బాబు ఇంత హఠాత్తుగానా అని కొంత సంశయించారట. వెంటనే పవన్ తాను డిసైడ్ అయిపోయానని … మీకేమైనా అభ్యంతరమా అని అడిగారట. ఆ సమయంలో చంద్రబాబు లోకేష్ , బాలకృష్ణల అభిప్రాయం కోరగా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే అని చెప్పారట. అంతే, పవన్ బయటకొచ్చి పొత్తు పై సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత భువనేశ్వరిని కలిసిన పవన్.. ఆమెకు ధైర్యం చెప్పారు. మళ్లీ మీ మొహంలో నవ్వు చూస్తామనే భరోసా కల్పించారు.
ఏ తప్పు చేయని చంద్రబాబును జగన్ జైలుకు పంపించారు. ఇదే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ను ఇరికించాలనే కుట్ర జరుగుతోంది. రేపు, అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్లొచ్చు. జగన్ అరాచకాలను అలాగే చూస్తుండిపోతే, ఇక ఏపీలో ప్రజల కోసం పోరాడేవారు ఎవరుండరని రెండు పార్టీల అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసే… జగన్ సర్కార్ అక్రమాలపై పోరాడనున్నాయి.