మార్గదర్శి పై కక్ష సాధింపు దుర్మార్గం: ఏలూరి

మార్గదర్శి పై కక్ష సాధింపు దుర్మార్గం: ఏలూరి

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చేయని మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ పాలన నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. జగన్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనాడు కథనాలు ప్రసారం చేస్తోందనే అక్కసుతోనే మార్గదర్శిపై పడ్డారని, సీఐడీని అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏదైనా ఒక సంస్థ ప్రమాదంలో పడితే ఖాతాదారులు ఊరుకుంటారా? వెంటనే తమ డబ్బులు తిరిగి చెల్లించమంటారు. మార్గదర్శి విషయంలో అలా ఏమైనా జరిగిందా? మార్గదర్శిని కుప్పకూల్చడం ద్వారా ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చని జగన్‌ కుయుక్తులు పన్నుతున్నారన్నారు.

మార్గదర్శి ఖాతాదారుల లిస్ట్‌ తీసుకుని స్వయంగా సీఐడీ అధికారులు వారికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగుతుండటం జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మార్గదర్శిలో మా డబ్బులు భద్రంగా ఉన్నాయి. మేము గడువు ముగిశాకే డబ్బులు తిరిగి తీసుకుంటామని ఖాతాదారులు కుండబద్దలు కొడుతున్నా జగన్‌ అండ్‌ కోకు సిగ్గు రావడంలేదంటే వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఒక కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసుకుని మరీ మార్గదర్శి ఖాతాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటే జగన్‌లో ఎంతటి అరాచకవాది ఉన్నాడో అర్ధమవుతోందన్నారు.

సోదాల పేరుతో మార్గదర్శి కార్యాలయాల్లో విలువైన డాక్యుమెంట్లు తరలించారు. బ్రాంచ్‌ మేనేజర్లను అరెస్ట్‌ చేయించారు. విచారణ పేరు చెప్పి రామోజీరావు, శైలజ ఫోటోలను బయటకు వదిలారు. ఇదంతా జగన్‌ రాజకీయ కక్షసాధింపు కాక మరేమిటి? ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఇలాంటివి చూశామా? అని సూటిగా ప్రశ్నించారు. చిట్‌ ఫండ్‌ యజమాని తన కమీషన్‌ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్‌ ఫండ్‌ చట్టమే చెబుతోంది కదా. కేవలం కంపెనీ ఆర్జించే కమీషన్‌, ఇతర ఆదాయ నిల్వలను మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర షేర్లు పెట్టుబడులుగా పెట్టారు. చిట్‌ సంస్థలు వ్యాపారం చేయకూడదని జగన్‌ రాజ్యాంగం చెబుతోందా? అని నిలదీశారు.

పాలకులకు అధికారులు గుడ్డిగా వంత పాడుతున్నారని విమర్శించారు. సీఐడీ అయినా ఏసీబీ అయినా రూల్స్‌కు విరుద్ధంగా జగన్‌ చెప్పినట్టల్లా తలాడిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్‌ అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులు శిక్షార్హులే. సీఐడీ ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేసి డిపాజిటర్లకు చేరాల్సిన నిధులను మళ్లించిన జగన్‌ ఏ మచ్చా లేని మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం దుర్మార్గం, అమానుషం. ఇకనైనా కక్షపూరిత రాజకీయాలకు జగన్‌ స్వస్తిపలకాలన్నారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *